ట్రాక్టర్, స్కూటర్ ఢీ: ఒకరి మృతి
కడప: వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ప్రొద్దుటూరులో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు..పట్టణంలోని సుధా థియేటర్ వద్ద ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న స్కూటర్ ను ఢీ కొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరిలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.