మోపెడ్‌ను ఢీకొన్నకారు: ఒకరి మృతి


కొడవలూరు: వేగంగా వెళ్తున్న కారు ఓ మోపెడ్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో జాతీయరహదారిపై జరిగింది. వివరాలు.. మండలంలోని ఎల్లాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామనర్తం గ్రామానికి చెందిన సుబ్బారావు(60), లక్ష్మీ దంపతులు మోపెడ్ వాహనంపై నెల్లూరు వెళ్తున్నారు.


కాగా, మార్గ మధ్యలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని కారు ఢీ కొనడంతో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మీ తీవ్రంగా గాయపడింది. గాయపడిన లక్ష్మీని 108లో నెల్లూరు తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top