బైక్ ఢీకొని ఒకరి మృతి


కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని హోసూరు సమీపంలో సోమవారం ఉదయం వాకింగ్ చేస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొంది. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పత్తికొండ పట్టణానికి చెందిన గోవిందప్ప(55)గా గుర్తించారు. గోవిందప్ప స్థానికంగా ఓ ఫొటో స్టూడియోను నిర్వహిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top