ఆటో బోల్తా: ఒకరి దుర్మరణం


రామచంద్రాపురం: ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాథగిరి సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం మండలం గల్ల గ్రామానికి చెందిన పది మంది అన్నవరం క్షేత్రానికి ఆటోలో బయలు దేరారు. ఆ ఆటో జగన్నాథగిరి మలుపులో అదుపు తప్పి ర్యాంపులోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top