బస్సు, లారీ ఢీ.. ఒకరి మృతి
ప్రకాశం(కొమరోలు): ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా మరో 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం వేకువ జామున ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కత్తెర వానిపల్లె సమీపంలో విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.