ట్రాక్టర్ బోల్తా... కూలీ మృతి
భీమడోలు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కూరెళ్లగూడెం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్ బోల్తా పడడంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండలంలోని గుండుగొలను గ్రామానికి చెందిన సుమారు 20 మంది కూలీలు చేపల ప్యాకింగ్ పని కోసం ట్రాక్టర్పై కూరెళ్లగూడెంకు వెళుతుండగా... ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.